UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 వైసీపీ నుంచి పేలుతున్న మాటల తూటాలు

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఓ టాక్ షోకి గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ షోని హోస్ట్ చేస్తున్నది మరో సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. దాంతో, సహజంగానే ఈ టాక్ షో విషయమై సినీ వర్గాలతోపాటు, రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. దీన్ని సాధారణ టాక్ షో అని అనుకోవడంలేదు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ – జనసేన మధ్య పొత్తుకు నిఖార్సయిన వేదికగా దీన్ని వైసీపీ పరిగణిస్తోంది.

వైసీపీ నుంచి పేలుతున్న మాటల తూటాలు.. వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా అన్ స్టాపబుల్ టాక్ షో మీద విమర్శలు చేస్తున్నారు. దానికి అటు జనసేన నుంచీ.. ఇటు టీడీపీ నుంచి కూడా కౌంటర్ ఎటాక్ అంతే స్థాయిలో వుంది. వాస్తవానికి రెండో సీజన్ స్టార్ట్ అయ్యాక.. రాజకీయ అంశాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో ఈ టాక్ షో కొత్త సీజన్‌ని నందమూరి బాలకృష్ణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఈ టాక్ షోలో సందడి చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !