UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 వైసీపీ నుంచి పేలుతున్న మాటల తూటాలు

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఓ టాక్ షోకి గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ షోని హోస్ట్ చేస్తున్నది మరో సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. దాంతో, సహజంగానే ఈ టాక్ షో విషయమై సినీ వర్గాలతోపాటు, రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. దీన్ని సాధారణ టాక్ షో అని అనుకోవడంలేదు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ – జనసేన మధ్య పొత్తుకు నిఖార్సయిన వేదికగా దీన్ని వైసీపీ పరిగణిస్తోంది.

వైసీపీ నుంచి పేలుతున్న మాటల తూటాలు.. వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా అన్ స్టాపబుల్ టాక్ షో మీద విమర్శలు చేస్తున్నారు. దానికి అటు జనసేన నుంచీ.. ఇటు టీడీపీ నుంచి కూడా కౌంటర్ ఎటాక్ అంతే స్థాయిలో వుంది. వాస్తవానికి రెండో సీజన్ స్టార్ట్ అయ్యాక.. రాజకీయ అంశాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో ఈ టాక్ షో కొత్త సీజన్‌ని నందమూరి బాలకృష్ణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఈ టాక్ షోలో సందడి చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !