మన్యం న్యూస్ ,వాజేడు: మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో సోడి మోహన్ రావు(37) అనే వ్యక్తిపురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై తిరుపతిరావు వివరాల ప్రకారం… కూలికి పోతేనే పట్టెడు అన్నం దొరికే పరిస్థితులలో కుటుంబం జీవనాన్ని కొనసాగిస్తున్న సోడి మోహన్ రావు, మద్యానికి బానిస అయ్యారు.కుటుంబం ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారి పోవడంతో దిక్కు తోచని పరిస్థితులలో పురుగుల మందు తాగారు. తక్షణమే ఆ వ్యక్తినీ ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోడి చిరంజీవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
