మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: పినపాక నియోజక వర్గంలోని మణుగూరు లో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రీడా పోటీలను రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు సతీమణి సుధారాణి ముందుండి నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే రేగా లేకపోయినా అన్ని తానై ముందుండి పోటీలను కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి వరకు వచ్చిన వారినందరిని ఆప్యాయంగా పలకరిస్తూ క్రీడాకారుల్లో చైతన్యాన్నినింపుతున్నారు. అంతేకాకుండా జడ్పీ కో ఎడ్యుకేషన్ హై స్కూల్ ఆవరణలో భోజన ఏర్పాట్లను కూడా దగ్గరుండి పరిశీలిస్తూ స్వయంగా క్రీడాకారులకు భోజనాలు వడ్డిస్తున్నారు.
