పొంగిలేటి తీరును అధిష్టానం నిశితంగా పరిశీలిస్తుంది
బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు,విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
బీఆర్ఎస్ పార్టీపై గత కొంతకాలంగా అసంతృప్తి గళం వినిపిస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై ఎమ్మెల్యే రేగా కాంతారావు కీలక వ్యాఖ్యలు చేశారు.పొంగులేటి వ్యవహారాన్ని అధిష్టానం నిశితంగా గమనిస్తోంది.బెదిరింపులకు సీఎం కేసీఆర్ భయపడే వ్యక్తి కాదు. మణుగూరు మండలం తో గూడెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎంకేసీఆర్ ఫొటో లేకపోవడం తీవ్రంగా పరిగణిస్తున్నామని వెల్లడించారు.