UPDATES  

 బి ఆర్ ఎస్ పార్టీ కి జారే రామ్ రామ్? ఎమ్మెల్యే మెచ్చా కి లైన్ క్లియర్?

బి ఆర్ ఎస్ పార్టీ కి జారే రామ్ రామ్?
ఎమ్మెల్యే మెచ్చా కి లైన్ క్లియర్?
👉పొంగులేటి తోనే నా ప్రయాణం అని తేల్చేసిన జారే
మన్యం న్యూస్. దమ్మపేట.జనవరి 09.
అశ్వారాపేట నియోజకవర్గం లొ బి ఆర్ ఎస్ పార్టీ జారే ఆదినారాయణ రామ్ రామ్ చెప్పేసారా? అవునని అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తో గూడెం సమ్మక్క సారలమ్మ ఆలయ పరిసరాలలో జరిగిన ఆత్మీయ సమావేశం లో పొంగులేటి శ్రీనివాస్ తోనే నా ప్రయాణం అనితెల్చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిసైతం పరోక్షంగా బి ఆర్ ఎస్ పార్టీ అధినేతలపై ప ఆరోపణలు చేసారూ. ఈ సందర్భంగా జారే ఆదినారాయణ మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు బి అర్ ఎస్ పార్టీ లో ఉన్న ఏనాడూ నాకు సరైన గుర్తింపు రాలేదని అన్నారు. ఇప్పుడు జారే ఆదినారాయణ బి ఆర్ ఎస్ పార్టీ అని చెప్పు కుంటారా, లేక బిజెపి అని ప్రజల్లో వెళ్తారా అని పలువురు సందేహిహిస్తున్నారు. ఇప్పటి వరకు బి ఆర్ ఎస్ పార్టీ కి సంబందించిన అన్ని కార్యక్రమాలు, సి ఎం సహాయనిది చెక్కులకు సంబందించిన పనులు చేసుకుంటూ వచ్చారు. ఈ తరుణం లో ఇప్పుడు జారే బి ఆర్ ఎస్ పార్టీనా మారిన నియోజక వర్గం లో క్రింది స్థాయి కార్యార్తలు అటు స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు తొ ఉంటారా లేక జరే తొ కలిసి నడువాలా అని అయోమయంలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జారే తీరు రానున్న ఎలక్షన్స్ లో ప్రస్తుత ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు లైన్ క్లియర్ చేశారని నియోజకవర్గ విశ్లేషకులు భావిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !