ఖమ్మంలో ఈనెల 18న బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగనున్న ప్రదేశాన్ని మంత్రి అజయ్ కుమార్,లోకసభ సభ్యులు నాగేశ్వరరావు,ఎంపీ రవిచంద్ర , ఎమ్మెల్సీ మధుల పరిశీలన
మన్యం న్యూస్ ప్రతినిధి:ఈనెల 18నఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగనున్న ప్రదేశాన్ని మంత్రి అజయ్ కుమార్,లోకసభ సభ్యులు నాగేశ్వరరావు,ఎంపీ రవిచంద్ర , ఎమ్మెల్సీ మధులుబుధవారం పరిశీలన చేశారు. ఈ
సభలో ,బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్యమంత్రికేసీఆర్,కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు,యుపీ మాజీ ముఖ్యమంత్రి తదితర హేమహేమీలు పాల్గొననున్నారు.
ఖమ్మం నగరంలో ఈనెల 18వ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనున్న ప్రదేశాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి బుధవారం ఉదయం పరిశీలించారు.ఆ రోజు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఖమ్మం శివార్లలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు.అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగసభలో కేసీఆర్,కేరళ, పంజాబ్,ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయన్,భగవంత్ సింగ్ మాన్ , అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితర ప్రముఖులు అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఈ సభ కలెక్టరేట్ వెనుక భాగాన ఉన్న 100 ఎకరాల సువిశాల ప్రదేశంలో జరుగనున్నది.ఈ సందర్భంగా స్థలాన్ని ఎంపీ రవిచంద్ర మంత్రి అజయ్ కుమార్, లోకసభ సభ్యులు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి పరిశీలించారు,ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లు,తీసుకోవలసిన చర్యలు,జాగ్రత్తల గురించి పోలీసు అధికారులతో చర్చించారు,పలు సూచనలు చేశారు, సలహాలిచ్చారు.
