ఏజెన్సీలో ఫారెస్ట్ శాఖ దందా
*అమాయకపు గిరిజనులను దోచుకుంటున్న వైనం
*ట్రెంచ్ కు వెలుపల బోరు వేయాలంటే రూ. 10-15 వేలు సమర్పించాల్సిందే
*ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా ఉన్నా బోరు వేయాలంటే పైకం సమర్పించాల్సిందే.
మన్యం న్యూస్, ఇల్లందు జనవరి11:- ఇల్లందు ఏజెన్సీ గ్రామాల్లో రిజర్వు ఫారెస్ట్ వ్యవసాయ భూముల్లో అక్రమంగా బోరు వేయాలంటే స్థానిక బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ , వాచర్ కు ఎవరి హవా నడిస్తే వారికి ఫారెస్ట్ మామూలు కింద 10-15 వేలు సమర్పించాలి.బోరు బండి ఊరిలో ఎంటర్ అయితే చాలు ఫారెస్ట్ ఏజెంట్ ను కలిసి బేరం మాట్లాడుకోవాలి. ఫారెస్ట్ హద్దు దాటిన వ్యవసాయ భూముల రైతులు బోరు వేసుకోవాలని అనుకుంటే అంత ఈజీ కాదు, సెక్షన్స్ అడ్డు వస్తాయి. మామూలు ఇచ్చుకుంటే సెక్షన్స్ ఉండవు. బోరు వేయించుకున్న తర్వాత బోరు కాస్ట్ తో పాటు ఫారెస్ట్ కమిషన్ కూడా బొరుబండి వారికి సమర్పించుకుంటే చాలు, కమిషన్ ఎక్కడకు చేరాలో చేరిపోతుంది.అది ఓపెన్ సీక్రెట్ అయిన ఎవరూ మాట్లాడరు. ఫారెస్ట్ భూముల్లో బోరుకు ఆ మాత్రం ఇవ్వకుంటే ఎలా!? అని మాట్లాడేవారే గ్రామాల్లో ఎక్కువ.ఈ కమిషన్ వ్యవహారం గత 3-4 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది, ఎప్పుడైతే ఫారెస్ట్ భూముల్లో ట్రెంచు కొట్టటం మొదలు అయిందో అప్పటి నుండి బోరు కమిషన్ మొదలైంది.సాధారణంగా నవంబర్ నుంచి జూన్- జూలై వరకు ఈ వ్యవహారం ఇల్లందు, గుండాల, మొదలైన ఏజెన్సీ గ్రామాల్లో నడుస్తుంటుంది.కమిషన్ వ్యవహారం లో కొన్ని గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా బాగంగా ఉన్నారు,కొందరేమో పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నారు. ఉంటాయో ఎప్పుడు ఊడతాయో తెలియని ఫారెస్ట్ వ్యవసాయ భూముల రైతులు, భూములు ఉన్న ఈ కొన్ని రోజులన్నా రెండు పంటలు వేసుకుందామనో లేక వేసిన ఒక్క పంటనన్నా వర్షాభావం ఏర్పడినప్పుడు నీళ్ళు పారించుకోవచ్చునని ఆశతో వేయించుకోవాలనే బొరుకు ఖర్చు తడిసి మోపెడు అవుతుంటే, ఫారెస్ట్ కమిషన్ అధిక భారం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏజెన్సీలో బోరు వేయటానికి వచ్చే బండ్లు సాధారణ ఛార్జ్ కాన్న కాస్త ఎక్కువ తీసుకుంటున్నారు. మారుమూల ప్రాంతం అనే పేరుతో, ఒక్క బోరు వేయాలంటే ఫుల్ కేసింగ్ తో లక్ష వరకు కర్చు అవుతుంది.బోరు వేయగానే నీళ్ళు తప్పక పడతాయని కూడా లేదు పడితే పడతాయి లేకపోతే మరో బోరు గుద్దియ్యాల్సిందే అలా లక్షల్లో బోరు కు కర్చు చేసి అప్పుల పాలు అవుతున్నారు ఏజెన్సీ రైతులు. అది చాలదన్నట్టు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉంది ఫారెస్ట్ బోరు కమిషన్ వ్యవహారం.
విచారణ చేయిస్తాను :- డి ఎఫ్ ఓ రంజిత్ కుమార్.
ఏజెన్సీ గ్రామాల్లో జరుగుతున్న ఫారెస్ట్ ఏరియాలోని వ్యవసాయ బోర్ల కమిషన్ విషయంలో ఎంక్వేరి చేయిస్తాను,కమిషన్స్ వసూలు చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకుంటామని డి ఎఫ్ ఓ రంజిత్ కుమార్ మన్యం న్యూస్ కు తెలియజేశారు.