మన్యం న్యూస్ ,దుమ్ముగూడెం ::
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి గ్రామానికి చెందిన శెట్టిపల్లి సురేష్ కుటుంబానికి భద్రాచలం శాసనసభ్యులు సిఫార్సు మేరకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 28,500 చెక్కును లబ్ధిదారుడు సురేష్ కు భద్రాచలం శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, నాయకులు బలుసు సతీష్, జిల్లా సోషల్ మీడియా చైర్మెన్ కనుబుద్ది దేవా, మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.