సకాలంలో వేతనాలు చెల్లించాలి….
మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: కాంట్రాక్ట్ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, ఓపెన్ కాస్ట్ గనులలో పనిచేస్తున్న ఓబీ వర్కర్లకు సింగరేణిలో ఉచిత వైద్యానికై మెడికల్ అటెండెన్స్ బుక్కులు ఇప్పించాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఏరియా ఎస్ ఓ టు జి ఎం లలిత్ కుమార్ కి బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం నాసర్ పాషా మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో సుమారుగా వివిధ కేటగిరీలకు చెందిన 1600 మంది ఓబి వర్కర్లుగా పనిచేస్తున్నారని, వీరికి గతంలో సింగరేణి వైద్యశాల పరిధిలో ఉచిత వైద్యానికై మెడికల్ అటెండెన్స్ బుక్కులు సింగరేణి యాజమాన్యమే ఇచ్చేవారన్నారు. ఓబి వర్కర్లు అందరికీ సింగరేణి ఉచిత వైద్యానికి మెడికల్ అటెండెన్స్ బుక్కులు ఇవ్వాలని ,ఓ బి క్యాంప్ లలో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ ఏరియా అధ్యక్షులు ఆంగోత్ మంగీలాల్, మాలోత్ రవి, శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, రాజు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
