మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం కొత్తగూడెం రానున్నారు. దీంతో పోలీసులు కొంతమంది నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మణుగూరు బి ఎస్ పి నాయకులు ఆలేం కోటి, బిజెపి నాయకులు బిక్షపతిలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వారిని మణుగూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
