మన్యం న్యూస్, గుండాల: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలోఈ నెల రోజుల18న నిర్వహిస్తున్న అతి పెద్ద బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని బి. ఆర్ .ఎస్ మండల ఇన్చార్జ్ కోలేటి భవాని శంకర్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకుల తో గుండాల, ఆళ్లపల్లి మండలాలలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈనెల 18వ తారీఖున ఖమ్మం నగరంలో పార్టీ బహిరంగ సభ పెద్ద ఎత్తున జరుగుతున్నదని దానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అధినేత నిర్వహించే మొట్టమొదటి అతిపెద్ద బహిరంగ సభను పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్య సమితిమండల అధ్యక్షులు వీరస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, సర్పంచ్ నరసింహారావు, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్ ,ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు, పార్టీ నాయకులు సుతారి సత్యం, అటికం నాగేశ్వరరావు, తాటి కృష్ణ , జాడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
