మన్యం న్యూస్ ఇల్లందు జనవరి11:- సీఎం కెసిఆర్ కొత్తగూడెం పర్యటన వేళా సీపీఐ (ఎం ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు ను ఇల్లందు పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ న్యూడెమోక్రసీ పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు.బుధవారం రోజు ఇల్లందు బుగ్గవాగు సెంటర్లో గల భగత్సింగ్ బొమ్మ వద్ద న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి కొక్కు సారంగపాణి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని, నిరంకుశపాలనను త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకెంతకాలం కొనసాగింస్తారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డం పెట్టుకొని పోలీసులు ప్రజాసమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న మధును, ఉద్యమకారులను అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్షించారు. ప్రజాసమస్యలు గాలికొదిలేసి ఇంత కాలం రాష్టంలో ఫామ్హౌస్ పాలన కొనసాగించి విలాసవంతమైన భవనాల ప్రారంభోత్సవాలకి రావడం రాబోయే ఎన్నికలకోసం ప్రజలను మరోసారి మోసపుచ్చడం కోసమే అభివృద్ధి పేరిట ఈ పర్యటనలననీ విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కి చిత్త శుద్ధి ఉంటే పోడుభూముల సమస్యను, భద్రాచలం ముంపు బాధిత