కొనసాగుతున్నరేగా విష్ణు మెమోరియల్ క్రీడా పోటీలు..
– క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
– క్రీడా పోటీల ఇంచార్జ్ పిఈటి పోలెబోయిన అనిల్ కుమార్.
మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: పినపాక నియోజకవర్గం లోని మణుగూరు మండలంలో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని క్రీడా పోటీల ఇంచార్జ్ పిఈటి పోలెబోయిన అనిల్ కుమార్ బుధవారం తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి క్రీడాకారులు వచ్చి పోటీలో పాల్గొంటున్నారన్నారు. తమలో ఉన్న ప్రతిభను వెలికి తీసుకునేందుకు ఈ క్రీడా పోటీలు చక్కని వేదికగా మారాయి అన్నారు. క్రీడాకారులు ఎంతో చక్కగా తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు.
