UPDATES  

 భద్రాచలంలో బిజెపి ఆటలు సాగవు.. *సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
బిజెపి ఆటలు భద్రాచలం నియోజవర్గంలో సాగనివ్వమని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని ఎలమంచి సీతారామయ్య భవనంలో మండల కమిటీ సమావేశం వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు ఈ కమిటీ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి పట్టిన శని బిజెపి పార్టీ అని బిజెపి పార్టీ రాష్ట్రంలో భద్రాచలం నియోజకవర్గం లో వారి పాటలు సాగనివ్వమని అన్నారు బిజెపి అధికారం వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేటుకు కోమ్ముకోస్తుందని మండిపడ్డారు. అలానే జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోడు భూముల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ ఎలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు చిలకమ్మ, చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు కొడాలి లోకేష్ బాబు, కృష్ణ, మహమ్మద్ బేగు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !