ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా
*చదువుల్లో రన్నించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని విద్యార్థిని, విద్యార్థులకు తెలిపారు.
*ప్రతి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానాని విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ
మన్యం న్యూస్ ,ములకలపల్లి: జనవరి 11. మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 22 వ వార్షికోత్సవ వేడుకలకు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే కు కళాశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.అనంతరం కళాశాలలోనీ సమస్యల గురించి కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా అడిగి తెలుసుకొని, ఐ టి డీ ఏ అధికారి సుబ్బరాజు కళాశాల సిబ్బందితో కలిసి పరిశీలించారు,అనంతరం ఇటడా ఐ టి డి ఏ పివో తో ఫోన్ లో మాట్లాడి ములకళపలి జూనియర్ కళాశాలకు అవసరమైన నిధులు కేటాయించాలని సంబంధిత శాఖ మంత్రి తో కూడా మాట్లాడుతానని తెలిపారు. కళాశాలలో చదువుతున్న జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన
ఈర్ల పావని,తోకల సుమశ్రి లను,
ప్రధమ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో 4వ స్ధానం సాధించిన
కాకి అనూష,షేక్.అజ్మత్ ఉన్నిస లను మెమోంటో తొ సత్కరించారు.కళాశాల సాంస్కృతిక కార్యక్రమంలో బాగంగా
పి.నవీన్,కే.అనూష, టి.అవినాష్ తేజ,పి.సరక్క,కే.లూసీ, ఐ.దివ్య, లను ప్రత్యేకంగా MLA మెచ్చా నాగేశ్వరరావు శాలువాతో సత్కరించి మేమొంటి అధాజేసి అభినందించారు. MLA ను కళాశాల సిబ్బంది శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ మన నియోజకవర్గంలో ములకలపల్లి జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ వేడుక ఇంత ఘనంగా నిర్వహించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని,ప్రవేట్ కళాశాలకు, పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయని దానికి ఉదాహరణగా మన ములకలపల్లి జూనియర్ కళాశాలని, పాటలు బోధించడానికి మంచి సిబ్బంది ఉన్నారని,అందరూ బాగా చదివి నియోజకవర్గానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.కళాశాలలో ఉన్న సమస్యలు చూశానని తప్పకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలోకళాశాల ప్రిన్సిపాల్ సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంపీపీ,ఎంపిటిసి లు,సర్పంచ్ లు,మండల పార్టీ అధ్యక్షుడు,మండల నాయకులు,యువ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.