మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: ఈడిఏసి నేషనల్ ఇగ్నైట్ ప్రోగ్రాంలో మణుగూరు బొంబాయి కాలనీ ఎక్స్ లెంట్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచారు.
ప్రధమ, ద్వితీయ, తృతీయ అవార్డులు సొంత చేసుకున్నారు. జశ్విత 3వ తరగతి (ఆర్ట్స్ విభాగం), షిఫా 4వ తరగతి (అకాడమీ విభాగం), దీపికా దానేశ్వరి 5వ తరగతి (అకాడమీ విభాగం)లు గెలుపొందారు. నోహిత లాస్య 5వ తరగతి (అకాడమీ విభాగం), సూశన్ 3వ తరగతి (అకాడమీ విభాగం), పూర్విశ్రీ 3వ తరగతి (ఆర్ట్స్ విభాగం)లు కన్సోలేషన్ అవార్డులు పొందారు.
అవార్డులు పొందిన విద్యార్థులు బుధవారం ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ యూసఫ్ షరీఫ్, డైరెక్టర్స్ ఖాదర్, యాకుబ్ షరీఫ్, కరస్పాండంట్ ఖాన్, ప్రిన్సిపాల్ బాను ఖాన్ లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఈడిఏసి ప్రతినిధులు పాల్గొన్నారు.
