మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: మణుగూరులో బుధవారం ఐటీ అధికారుల దాడులు కలకలం రేపాయి. ఒక్కసారిగా మణుగూరు వ్యాపారస్తులు ఉలిక్కిపడ్డారు. ప్రముఖ వ్యాపార వేత్తకు చెందిన మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని వ్యాపార సముదాయాలు, ఇంటిలో ఒకే సమయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్టు సమాచారం. అంతేకాకుండా పలు దుకాణాల్లో కూడా దాడులు నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా మణుగూరులో ఐటీ దాడులు జరగడంతో హాట్ టాపిక్ గా మారింది.
