మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
చతిస్గడ్ – తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్ మృతి చెందినట్లు తెలుస్తుంది బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి అందులో కేంద్ర కమిటీ సభ్యుడు మోస్ట్ వాంటెడ్ గుర్తింపు. తెలంగాణ- బీజాపూర్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్, సిఆర్పి కోబ్రా ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి విజయం సాధించారు. ఏడో తరగతి చదువుకున్న హిడ్మా 17 సంవత్సరాల వయసులో మావోయిస్టు పార్టీకి ఆకర్షితులై చేరాడు హిందీ ఇంగ్లీష్ తెలుగు అన్ని భాషల్లో దిట్ట, దక్షిణ బస్తర్ సుక్మా జిల్లా పువర్తి హిడ్మా స్వగ్రామం. అంచెలంచెలుగా ఎదుగుతూ పోలీస్ వారి ప్రణాళికలను గుర్తించి వారిపై ఎదురుదాడి చేయడంలో సిద్ధస్థుడు, బీజాపూర్ జిల్లాలోని 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంలో హిద్మా నే ప్రధాన సూత్రధారి ఇతనిపై 50 లక్షల రివార్డు కలిగి ఉంది.
