దేశ చరిత్రను మార్చే సువర్ణ యుగం ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం..
బీజేపీ వ్యతిరేక శక్తులందరినీ ఏకం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ బృహతరమైన నిర్ణయంతో ఖమ్మం జిల్లా వేదికగా ఏకం కానున్న జాతీయ నేతలు..
ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
*ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో ఇల్లందు నియోజకవర్గం నుండి ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు 50వేల మంది తరలి వచ్చే విధంగా జన సమీకరణ..
మన్యం న్యూస్,ఇల్లందు:దేశ చరిత్రను మార్చే సువర్ణ యుగం ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అనిఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ అధ్యక్షతన బుధవారంనిర్వహించిన సమావేశంలో
ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మన దేశ ప్రజలకు అందించేందుకు గౌర ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని స్థాపించారని అని తెలిపారు. ఈనెల 18వ తారీఖున ఖమ్మం జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ తో యావత్ దేశ ప్రజలకు దిక్సూచిని తెలియజేసే విధంగా కేసీఆర్ నాంది పలకనున్నారని తెలిపారు.
దేశ రాజకీయాల్లో రాణించే విధంగా కేసీఆర్ సంకల్పం నెరవేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలంగాణ బిడ్డలంతా అండగా ఉండి మద్దతు తెలిపే విధంగా దోహదపడాలని వారు కోరారు.
సభా ప్రాంగణానికి ఉదయం 10:00 గంటల లోపే చేరుకునే విధంగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి బయలుదేరాలని, బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరు బహిరంగ సభ అనంతరం క్షేమంగా నియోజకవర్గానికి చేరుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు భద్రాద్రి జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజేంద్ర గారు, రమణగారు, ఇల్లందు మార్కెట్ చైర్మన్ హరి సింగ్ గారు, మరియు ఇల్లందు నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.