మన్యం న్యూస్, భద్రాచలం :
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… పెన్షనర్లకు1వ తేదికే పెన్షన్స్ ఇవ్వాలని, మూడు డీఏలను వెంటనే ఇప్పించాలని, ఆర్.టీ.సి బస్సులలో ఛార్జిలో40%రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పి.ఆర్.సి కొత్త కమిటీ నియమించాలని, ఇన్ కమ్ టాక్స్10లక్షలకు పెంచాలని తదితర డిమాండ్స్ తో కూడిన మెమోరాండంను భద్రాచలం ఆర్.డి.ఓ రత్న కళ్యాణి కి అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎల్.వి.ప్రసాద్, ఉపాధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ నారాయణ, డి కృష్ణ మూర్తి. మంగయ్య తదితరులు పాల్గొన్నారు.