మధ్యాహ్నం 1.55గంటలకు..
కొత్తగూడెంకు పెద్ద సారు
భద్రాద్రి పాలనాసౌధం ప్రజలకు అంకితం చేయనున్న కేసీఆర్
2.50గంటలకు ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న సీఎం
3.35గంటలకు బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం
జిల్లా అధ్యక్షుడి స్థానం అలంకరించనున్న కాంతారావు
ఆశీర్వదించనున్న సీఎం కేసీఆర్
రెండున్నర గంటల పాటు కొత్తగూడెంలో సీఎం
జిల్లాకు వరం.. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం
ఎంతోకాలంగా.. జిల్లా ప్రజలు, గులాబీనేతలు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. గురువారం మధ్యాహ్నం 1.55గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగూడెం అడుగుపెట్టనున్నారు. రెండున్నర గంటల పాటు జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనున్న జిల్లా కార్యాలయం విద్యుత్ వెలుగుల మధ్య ధగధగలాడుతోంది. బిఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభించనుండగా, మధ్యాహ్నం 3.35గంటలకు రేగా కాంతారావు బాధ్యతలు తీసుకుని.. కేసీఆర్ ఆశీస్సులు అందుకోనున్నారు. ఈ పర్యటనపై, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కురిపించే వరాలపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
………..