మన్యం న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కార్యాలయం సముదాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుగ గురువారం ప్రారంభోత్సవం చేశారు.
హెలికాప్టర్ ద్వారా మహబూబాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు చేరుకున్న సీఎం కేసీఆర్ కు జిల్లా నేతలు, అధికారులు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీఎం కేసీఆర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం రిబ్బన్ కట్ చేసి నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కొబ్బరికాయ కొట్టి జిల్లా కలెక్టర్ ఛాంబర్ ను సీఎం ప్రారంభించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కుర్చీలో కూర్చోబెట్టి, పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ సీఎం కేసీఆర్ కి దేవతాప్రతిమను అందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, కవితా నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధుసూధన్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర రావు, రేగా కాంతారావు, రాములు నాయక్, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వర రావు, బాల్క సుమన్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ, పూల రవిందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి. రాజేందర్, డిసిసిబి చైర్మన్ కె.నాగభూషణం, కలెక్టర్ అనుదీప్, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, నిర్మాణ సలహాదారు సుద్ధాల సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.
