మన్యం న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కి పండితులు వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని, బీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు.
బిఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును సీట్లో కూర్చోబెట్టి సీఎం ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
