ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
మన్యం న్యూస్, సారపాక :
ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం అని కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి బూర్గంపాడు మండల పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని ప్రజా సమస్యల మీద ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని పేర్కొన్నారు. జిల్లాలోని కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజా సమస్యల మీద ప్రశ్నించకుండా వారి గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ నాయకులు బట్ట విజయ గాంధీ, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహిమూడ్ ఖాన్, మండల నాయకులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చల్లా వెంకట నారాయణ, మండల నాయకులు పూలపెల్లి సుధాకర్ రెడ్డి, బూర్గంపాడు పట్టణ అధ్యక్షుడు మందా నాగరాజు, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.