UPDATES  

 పరమతాలను గౌరవించినప్పుడే స్వామి వివేకానంద బోధనలకు సార్ధకత

 

మన్యం న్యూస్, భద్రాచలం :

పర మతాలను గౌరవించుకొని మనం ముందుకు వెళ్లినప్పుడే స్వామి వివేకానందుని బోధనలకు సార్ధకత లభిస్తుందని, గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నకుమారి విద్యార్థులకు సూచించారు.
గురువారం నాడు భద్రాచలంలోని గురుకులం డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని విద్యార్థిని, విద్యార్థులు ఎన్ఎస్ఎస్, బృందంతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ… స్వామి వివేకానందుడు యువతీ, యువకులకు విలువైన సందేశాలను వివరిస్తూ కెరటం నాకు ఆదర్శమని, ఎందుకంటే పడినందుకు కాదు పడిన లేచినందుకు అని వివేకానందుని ఘనతను విద్యార్థిని, విద్యార్థులకు తెలియజేస్తూ వివేకానందుడు చూపిన బాటలో నడిచి ఆయన బోధనలను ఆచరణలో పెట్టుకొని మనం కూడా పదిమందికి సహాయపడేలా మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థినిలు చురుకుగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారని, చూపరులకు ఈ ముగ్గుల ఆకట్టుకున్నాయని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !