UPDATES  

 కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

 

మన్యం న్యూస్, భద్రాచలం :

భద్రాచలం మహిళా కాంగ్రెస్, మైనార్టీ మహిళా కాంగ్రెస్ నాయకులు సరిత, హసీనా, వసీమా ల ఆధ్వర్యంలో గురువారం ఇందిరానగర్ కాలనీలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ కాలనీ మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి ప్రతిమలతో ముగ్గులను వివిధ రకాల రంగులతో అద్భుతంగా ముగ్గులను వేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చింతిరేల రవికుమార్, ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతిలు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంధం శ్రీనివాస్ గౌడ్, బలుసు నాగ సతీష్, సరేళ్ళ వెంకటేష్, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతిరేల సుదీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాడారి ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఓంపోలు దేవకి, జగ్గా కుమారి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !