మన్యం న్యూస్, దుమ్ముగూడెం:నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం చేయాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు ఎలమంచి. వంశీకృష్ణ డిమాండ్ చేశారు. మండలం లోని మారాయి గూడెం కొనుగోలు కేంద్రంలో డిసెంబర్ 25వ తారీఖున 859 బస్తాల ధాన్యం లోడువేసి వెంకట సాయి రైస్ మిల్ కి పంపించారు. ఈ నేపథ్యంలో ధాన్యం బాగాలేదని లారి పెండింగ్ పెట్టి వెనక్కి తీసుకొని వెళ్ళిపొమ్మని రైతులను బెదిరించి 61 బస్తాల ధాన్యాన్ని తరుగు కింద సంతకాలు బెదిరించి సంతకాలు తీసుకున్నారని అన్నారు. కొత్త ట్రక్ షిట్ 795 బస్తాలకు ఇచ్చారని, దీనిపైన విచారణ జరిపి ఆదివాసి గిరిజన రైతాంగానికి న్యాయం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు ఎలమంచి వంశీకృష్ణ, బొల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. తరుగుపేరుతో ధాన్యం లో కోత విధించడం అన్యాయమని వారన్నారు. మిల్లర్ల దోపిడి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తొడెం. తిరుపతిరావు, అర్జున్, అపకా.సంతోష్, కారం. శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
