UPDATES  

 ఘనంగా రాములోరి నిత్య కళ్యాణం

 

మన్యం న్యూస్, భద్రాచలం :
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో రాములోరి నిత్య కల్యాణం గురువారం కన్నుల పండువగా జరిగింది. వేకువజామునే ఆలయ తలుపులు తెరిచిన స్వాములు ముందుగా స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, ఆరగింపు కార్యక్రమాలను జరిపారు. తదుపరి స్వామివారిని పల్లకిపై ఊరేగింపుగా బేడా మండపం వద్దకు తీసుకువచ్చి అక్కడ స్వామివారిని వేంచేయింప చేశారు. అర్చకస్వాములు నిత్యకల్యాణంను సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !