మన్యం న్యూస్, బూర్గంపాడు జనవరి 12 :మండలంలోని మొరంపల్లి బంజర్ గ్రామంలో స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు గురువారంనిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి మొరంపల్లి బంజర గ్రామ సర్పంచ్ భూక్య దివ్యశ్రీ పూల మాలలువేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసగాని శ్రీనివాస్ గౌడ్, మొరంపల్లి బంజర్ మాజీ ఎంపీటీసీ వెన్నం వెంకటేశ్వర్లు, కిసాన్ జిల్లామోర్చా కార్యవర్గ సభ్యులు బిజం వెంకట్రెడ్డి, బూర్గంపాడు ఓబీసీ మండలాధ్యక్షులు వెలిశెట్టి రామారావు, కేసు పాక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
