మన్యం న్యూస్,దుమ్ముగూడెం:
మండలకేంద్రం లక్ష్మీనగరం లో గురువారం ప్రముఖ న్యాయవాది కొత్త.మల్లేశ్వర రావు గురువారం ఉచిత న్యాయ సలహా కేంద్రాన్నిప్రారంభించారు.ఈ కార్యాలయంలో భూ వివాదాలు,కుటుంబ తగాదాలు, ఇతర సివిల్,క్రిమినల్ కేసులేమైనా పరిష్కారం కోసం తనను సంప్రదించవచ్చని నిత్యం కార్యాలయంలో అందుబాటులో ఉంటామని లాయర్ కొత్త.మల్లేశ్వర్ రావు తెలిపారు.ఈ ప్రారంభోత్సవంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రేవూరి. జయరాజ్,సీనియర్ అడ్వకేట్ బండారు.అరుణ్ చంద్,పేరాల.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
