మన్యం న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గురువారం బి.ఆర్.ఎస్ జిల్లా నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బీఆరెస్ భద్రాద్రి జిల్లా బాస్,విప్ ,ఎమ్మెల్యే రేగా కాంతారావు, రేగా సుధమ్మ దంపతులు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ మండలాల మహిళ ప్రజా ప్రతినిధులు బూర్గంపాడు మార్కెట్ కమిటీ పోడియం ముత్యాలమ్మ,అశ్వాపురం జడ్పిటిసి సూదిరెడ్డి సులోచన, బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, ఆళ్లపల్లి ఎంపీపీ గుండ్రు మంజు భార్గవి, బీఆరెస్ పార్టీ అశ్వాపురం మండల మహిళ విభాగం అధ్యక్షురాలు తోకల లతలు హారతితో దీవించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దంపతులను ఆశీర్వదించడం జరిగింది.
