మన్యం న్యూస్,ములకలపల్లి: మండల కేంద్రంలోని మల్కారం రోడ్డులో గల సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు పసుమర్తి విరేశ్వర రావు,పసుమర్తి సత్యనారాయణ,దారా గోపి,దారా ప్రసాద్,పసుమర్తి సాయి రాం,కంభంపాటి సాయి తదితరులు ఆధ్వర్యంలో జరుగుతున్న సుదర్శన హోమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మెచ్చాను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ దారా యుగంధర్,టౌన్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు యార్లగడ్డ బాబు, చిన్నంశెట్టి సత్యనారాయణ, అబ్దుల్ జిన్నా, పానుగంటి చిట్టి బాబు, కౌలురి నాగయ్య, పండురీ విర బాబు,గాజుబొయిన యేసు,లోకేష్,భూఖ్యా రాజు,తదితరులు పాల్గొన్నారు.