మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి జనవరి 12 : మండలపరిధిలో గల అబ్బుగూడెం గ్రామంలో బిజెపి పార్టీ ఓబీసీ మోర్చా జబ్బురు రమేష్ఆధ్వర్యంలో గురువారంస్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం స్థానిక పాఠశాలలో విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి జటంగి కృష్ణ,ఓబిసి మండల అధ్యక్షులు దూదిమెట్ల విజయ్,ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి జుబ్బురు రమేష్,ఎస్టి మోర్చా నాయకులు పోతిని రంగా,ఓబిసి మండల ఉపాధ్యక్షులు ముద్దమూరు కృష్ణయ్య,మండల బీజేపీ నాయకులు చిన్నం అప్పారావు,జుబ్బురు వెంకటేశ్వరరావు,జుబ్బురు మల్లేశ్వరరావు,కుసుని గోపాలకృష్ణ,దూదిమెట్ల శ్రీకాంత్, గ్రామస్థులు పాల్గొన్నారు.