మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 11: మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరిధిలోని ఓసి 4 నిర్వాసిత పెద్దిపల్లి వలస గొత్తి కోయలకు 50 కుటుంబాలకు వంద దుప్పట్లను గురువారం సింగరేణి సేవా సమితి సభ్యులు గ్రామస్థులకు అందజేశారు. ఈ సందర్బంగా సింగరేణి ఓసి 2 పవర్ సెక్షన్ ఉద్యోగి రవిబాబు మాట్లాడుతూ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక వృద్ధాశ్రమాలకు, అనాధ శరణాలయాలకు, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు నిర్వాసిత, సమీప గ్రామాల పేద ప్రజలకు అన్ని విధాలుగా అండదండలు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా, మడకం బాబురావు, కోశయ్య, రోజా, అంగన్వాడి కార్యకర్త తాటి శ్రీలత, మడివి భీమయ్య, మడకం చిన్న సోమయ్య, చుక్కయ్య ,ఉంగయ్య తదితరులు పాల్గొన్నారు.
