UPDATES  

 ఇల్లందు అబివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు : ఎమ్మెల్యే హరిప్రియ

 

మన్యం న్యూస్ ఇల్లందు జనవరి13:- ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ క్రింద రూ.25 కోట్ల రూపాయలను మరియlప్రతీ గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తున్నట్టు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యలయం  ప్రారంభోత్సవంలో ప్రకటించిన సీఎం  కేసీఆర్ త్వరలో నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం విదితమే,
ఈ సందర్భంగా ఇల్లందు శాసన సభ్యురాలు  బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ శుక్రవారం రోజు మీడియాతో మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి  కేసీఆర్  అహర్నిశలు కృషి చేస్తున్నారని, అభివృద్ధి పథంలో ముందడుగు దిశలో కొనసాగుతున్న ఇల్లందు మున్సిపాలిటీకి మరోసారి ప్రత్యేక ఫండ్ కింద రూ.25 కోట్ల రూపాయలను ప్రతీ గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల రూపాయలను మంజూరు చేయడం అనేది సంతోషకర విషయం అని అన్నారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ అన్ని గ్రామ పంచాయతీ ప్రజల తరపున ఇల్లందు మున్సిపాలిటీ పాలక వర్గం తరఫున, ఇల్లందు పట్టణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి  కేసీఆర్ కు  ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే  బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్  తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !