UPDATES  

 అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోదాం జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 13..అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోయేడమే కాకుండా కళలనే నమ్ముకుని జీవిస్తున్న కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో శ్రీ వినాయక నాట్య మండలి సురభి నాటికలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న ఈ రోజుల్లో కళలనే నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను అభినందనలు తెలియజేశారు. నేడు ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందినది, కానీ ఆనాటి రోజుల్లో ప్రజలు నాటికలు చూసి ఆనందించేవారని చెప్పారు. 136 సంవత్సరాలు చరిత్ర సురభి కళాకారులదని చెప్పారు. సాంకేతికత లేని ఆ రోజుల్లో కళల ద్వారా ప్రజల చైతన్యవంతలుగా చేసింది కళాకారులేనని, ఎంత సాంకేతికత అభివృద్ది చెందినా కళలనే నమ్ముకుని జీవిస్తున్న కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కళలు ప్రదర్శన చేస్తున్న కళాకారులు అభినందనీయులని ఆయన అభినందించారు. అనంతరం ప్రదర్శించిన మాయా బజార్ నాటికను వీక్షించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !