UPDATES  

 సార్ న్యాయం చేయండి రేగాను కలిసిన ఐటిసి భూ నిర్వాసితులు

మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 13 .. పైప్ లైన్ పేరుతో మా భూములు కోల్పోయామని తక్షణమే మాకు నష్ట పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు ప్రభుత్వ విప్ రేగ కాంతారావు ను వేడుకున్నారు. శుక్రవారం కోయగూడెం ప్రాంతానికి చెందిన రైతులు మాట్లాడుతూ మండలంలోని ఇరవైండి కోయగూడెం పంచాయతీలలో గత కొంతకాలం క్రితం
ఐటీసీ సంస్థ ఇరవెండి నుంచి సారపాకలోని ఐ టి సి కంపెనీకి వాటర్ పైప్ లైన్ వేయుటకు ఇరవెండి, కోయగూడెం రైతుల భూములల్లో సర్వే చేసి ఆ భూముల నుంచి పైపులైన్లు వెళ్తున్నాయని ఆరోపించారు. దీంతో వ్యవసాయ భూములు కోల్పోయి రైతులు నష్టపోతున్నాం అని ఐటీసీ అధికారులను నష్టపరిహారం అడిగిన ఎలాంటి నష్టపరిహారం ఇవ్వమని తేల్చి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . కచ్చితంగా భూముల్లో పైపులైను వేస్తామని, భూములు ఇవ్వాలని ఇద్దరు ఐటీసీ కాంట్రాక్టర్లతో కుమ్మకై కొందరు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు . అంతేకాకుండా భూములు ఎలా ఇవ్వరో చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో న్యాయం జరిగేందుకు బాధితులు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని కలిసి వినతి పత్రం అందజేశారు
ఆయన సానుకూలంగా స్పందించి నష్టపరిహారం అందేలా ఐటిసి వారితో మాట్లాడతామని  హామీ ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !