UPDATES  

 తెలంగాణ సాంప్రదాయాలను బతికించుకుందాం శ్రీ రాగా ప్లే స్కూల్ , హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 13… అంతరించిపోతున్న నాగరికతను విద్యార్థులకు తెలియజేసే బాధ్యత ప్రతి ఉపాధ్యాయులపై ఉందని సంస్కృతి సాంప్రదాయాలను బతికించుకునే సమయం ఆసన్నమైందని శ్రీరాగ ప్లే స్కూల్ ,హై స్కూల్ కరస్పాండెంట్ మల్లావరపు వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని
, మేదర బస్తీ లో శ్రీ రాగా ప్లే స్కూల్ హై స్కూల్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి..
ముందుగా యాజమాన్యం మల్లారపు.వర ప్రసాద్, కవితలు పూజ చేసి చెరుకు గడల మధ్య పాలు పొంగించి సంబరాలు ప్రారంభించారు.
ఈ సంబరాల్లో భాగంగా ప్లే స్కూల్ చిన్నారుల ఫాన్సీ డ్రెస్సు ల్లో : విజేతలైన వారికి బహుమతులను అందజేశారు .అబ్బాయిలకు పతంగుల పోటీలు,అమ్మాయిలకు ముగ్గులు గోరింటాకు పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు.. ఈ సందర్భంగా
వర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోతున్న తరుణం లో చిన్నారులకు చదువు తో పాటు విలువలు,సంస్కృతి సాంప్రాయాలను నేర్పుతూ విలువైన వారి జీవితాలకు చక్కని బాటలు వేస్తూ మరోప్రక్క ఈ పోటీ ప్రపంచంలో ముందుండే విధంగా ఎన్నో పోటీ పరీక్షల్లో విద్యార్థులను తీర్చి దిద్దుతున్నాము అన్నారు..ఈ కార్య క్రమం లో ఉపాధ్యాయులు రాంబాబు,సర్వేశ్వర రావు,సైమన్,వాసు,అనూష,రాధిక,పుష్ప లత,నవ్య, పద్మావతి,శిరీష,స్రవంతి , విద్యార్థులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !