మన్యం న్యూస్ గుండాల, జనవరి 13.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని అంతరించిపోతున్న నాగరికతను పిల్లలకు అర్థమయ్యే రీతిలో విశదీకరించాలని ఆళ్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరన్న తెలిపారు. శుక్రవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ముగ్గుల పోటీని నిర్వహించారు. ఈ పోటీలలో పాఠశాల విద్యార్థినిలు పెద్ద ఎత్తున పాల్గొని రంగు రంగు హరివిల్లుల ముగ్గులు వేశారని ప్రధానోపాధ్యాయులు వీరన్న తెలిపారు. ఈ ముగ్గుల పోటీలలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు, ప్రధమ బహుమతిగా రశ్మిత, ద్రుతీయ బహుమతిగా మౌనిక, తృతీయ బహుమతిగా శరణ్య ను ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది శ్రీనివాస్, ప్రభాకర్ రావు, పాపారావు, యమున, రాంబాబు, శ్రీను, చిరంజీవి తదితరులు పాల్గొన్నా
