మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 13: సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా జిఎం కార్యాలయం లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గోపయ్య పక్షవాతం వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో శుక్రవారం జిఎం కార్యాలయం అధికారులు, మినిస్ట్రియల్ స్టాప్, కార్యాలయం ఉద్యోగులు రూ. 87,970ల నగదు, ఒక నెల సరుకులను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం వెంకటేశ్వర రెడ్డి, అధికారులు వెంకటేశ్వర్లు, రమేష్, వెంకట్రావు, శ్రీనివాస మూర్తి, అబ్దుల్ షబీరుద్దీన్, టీబీజీకేస్ యూనియన్ నాయకులు ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
