మన్యం న్యూస్ ,కరకగూడెం, జనవరి 13 .. కరకగూడెం మండల పరిదిలోని మోతే – బర్లగూడెం గ్రామల మద్యలోగల పెద్దవాగుపై సుమారు రూ.4 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసే అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ వందల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారని ఆయన అన్నారు.మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.పినపాక నియోజకవర్గంలో ని మారుల గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే వరకు విశ్రమించేది లేదని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్. ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం.నర్సింహరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులుబుడగం.రాము,కొంపెల్లి పెద్దరామలింగం,పోగు.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
