మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 13: ఈనెల 18 నుంచి జరిగే కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకుమార్, నేత్ర వైద్యాధికారి సంజీవరావులు శుక్రవారం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో సంపూర్ణ ఆందత్వ నివారణ కోసం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
