UPDATES  

 వాలీబాల్ క్రీడాలను ప్రారంభించిన ఎస్ఐ జీవన్ రాజు.

మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిదిలోని తాటిగూడెం గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ క్రీడలను స్థానిక ఎస్ఐ ఇరుగు జీవన్ రాజు శుక్రవారం ప్రారంభించారు. . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో యువతకు కొదవలేదని వారి శక్తి సామర్థ్యాలు అతీతమని ఏజెన్సీ ప్రాంతాల నుంచి జాతీయస్థాయిలో రాణించే శక్తిసామర్థ్యాలు యువతకు ఉన్నాయని క్రీడల నైపుణ్యాలను మరింతగా పెంచుకోవాల్సి ఉందని అన్నారు. జాతీయస్థాయిలో రాణించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా క్రీడాకారులకు సూచించారు. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మత్తు పానీయాలు సేవించి జీవితం నాశనం చేసుకోరాదని అన్నారు.ఈ క్రీడలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొమరం విశ్వనాథం,ఉప సర్పంచ్ నాగరాజు, కొమరం. కాంతారావు,పొలేబోయిన. వెంకటనారాయణ,గొగల కృష్ణ కొమరం.అనిల్ కుమార్, పోలేబోయిన.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !