**పైప్ లైన్ లీకుతో వృధాగా చెరువులోకి పోతున్న సురక్షిత త్రాగునీరు
*రెండు నెలలైనా కన్నెత్తి చూడని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
*ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
మన్యం న్యూస్ గుండాల: మిషన్ భగీరథ నీరు చెరువు పాలవుతున్న అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అవ్వడంతో పెద్ద ఎత్తున మిషన్ భగీరథ నీరు వృధాగా పోతుంది. మిషన్ కాకతీయ చెరువు ని మిషన్ భగీరథ నీరుతో అధికారులు ఏమన్నా నింపుతున్నారా? అనే చందంగా మండల ఆర్డబ్ల్యూఎస్ అధికారుల వ్యవహార శైలి ఉంది. మండల మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంపై మన్యం న్యూస్ ప్రత్యేక కథనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి శుద్ధమైన మంచినీరు అందించాలన్న దృఢ సంకల్పంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తే, క్షేత్రస్థాయికి వచ్చేసరికి అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ పథకం అభాసు పాలు అవుతుంది.వివరాల్లోకి వెళ్తే ఆళ్లపల్లి మండలం మర్కోడు పంచాయతీలోగల కిచ్చనపల్లి గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ లీక్ అవడంతో గ్రామ సమీపంలోని ఎర్ర చెరువుకు నీరు వృధాగా పోతుంది. ఆ శాఖ అధికారుల మూలంగా సగం నీరు లీకులతోనే వృధాగా పోతుంది. ఉన్న నీరైన సక్రమంగా ఇస్తున్నారా అంటే రెండు బిందెలు వచ్చేలోపే కులాయి ఆగిపోతుంది. ఉమ్మడి మండలంలో మిషన్ భగీరథ నీళ్లు సరిగా రాక మండలంలోని పలు గ్రామాల ప్రజలు త్రాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు .ఈపథకం ప్రారంభమై ఐదు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ స్థానిక అధికారులు పూర్తిస్థాయిలో ప్రజలకు త్రాగునీరు అందించడంలో విఫలమవుతున్నారు అనే ఆరోపణలు మెండుగా వినపడుతున్నాయి. దీనికి తోడు స్థానిక ఆపరేటర్లు సైతం మా ఇష్టం ఉన్నంతసేపే ఇస్తాం మాకు నచ్చినప్పుడే వేస్తాం అంటూ ప్రజలతోనే వాగ్వాదానికి దిగుతుండడంతో ప్రజలు సైతం ఏమీ అనలేని స్థితిలో ఉంటున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ పథకంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితిని చక్కదిద్దకపోతే పథకం అభాసపాలవు అవడం ఖాయమని వాదనలు వినిపిస్తున్నాయి
*మిషన్ భగీరథ ఏఇ వీరబాబునుకిచ్చనపల్లి గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ లీక్లతో సురక్షిత మంచినీరు చెరువు పాలు అవుతున్న విషయమై మన్యం న్యూస్ వివరణ కోరగా… ఈ విషయం తన దృష్టికి రాలేదని వెంటనే లీకేజీ పనులను పూర్తి చేసి నీరు అందించే విధంగా కృషి చేస్తానని మిషన్ భగీరథ ఏ ఇ వీరబాబు తెలిపారు
