మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 14, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టి రైతులకు పెట్టుబడి సహాయంగా ఇచ్చి ఆదుకొని రైతన్న ఇంట్లో సంక్రాంతి పండుగ తీసుక రాగా, రైతులు పండించే పంటను ప్రభుత్వ బిఆర్ఎస్ పార్టీ జెండా రక్షిస్తుంది. ఈ చిత్రం మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామానికి చెందిన మాలోత్ బాబురావు అనే రైతు చేలో ఆవిష్కృతం కాగా, మన్యం న్యూస్ ప్రతినిధి కెమెరాకు చిక్కింది. వివరాలు రైతు మాటల్లో.. తాను సుమారుగా రెండు ఎకరాలలో జొన్న పంటను సాగు చేయగా, జొన్న పాలకంకి దశ నుండి పంటపై పక్షుల దాడి పెరగడంతో పక్షులను నియంత్రించేందుకు అందుబాటులో ఉన్న జండాలను కట్టానని తెలిపారు. కెసిఆర్ రైతుబంధుతో రైతును, కెసిఆర్ జెండా రైతు పంటను రక్షిస్తుందని నవ్వుతూ మన్యం ప్రతినిధికి తెలిపారు.