మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి 14: నిత్యం పంచాయతీ విధుల్లో ఉండి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ వర్కర్లకు జావలీ పెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ యజమాని రంగిశెట్టి ముఖేష్ శనివారం చీరెలను వితరణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ… గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచటంలో టెంపరరీ వర్కర్లను పండుగ రోజు ఆనందంగా ఉంచాలనే భావనతో వారందరికి చీరెలను అందజేయటం జరిగిందన్నారు. పేదలకు సహాయ పడటంలోనే ఆనందం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్లు పాల్గొన్నారు.