UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఏలూరులో రిలయన్స్ జియో ట్రూ5జీ సేవలు ప్రారంభం

రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో శనివారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో నెట్వర్క్ కోసం జియో ఇప్పటికే రూ. 26,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. అదనంగా 5 జి నెట్వర్క్‌ను ఏర్పాటు చేయడానికి మరో రూ. 6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల జియోకున్న అపారమైన నిబద్ధతను చూపిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్‌ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి మరియు ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది.

జియో ట్రూ 5 జి పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్టచివరి అడుగు వరకు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ సందర్భంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మందపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ లో జియో ట్రూ 5జీని విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ -5 జి ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు. అందువల్ల ఈ గణనీయమైన మార్పుకు ఉన్న శక్తి, దాని అపార ప్రయోజనాలను మన దేశంలోని ప్రతి పౌరుడు అనుభవించగలడు. ఆంధ్రప్రదేశ్ ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అన్నారు. ఏలూరుతో పాటు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 15 నగరాల్లో. ఛత్తీస్‌గఢ్ (రాయ్‌పూర్, దుర్గ్, భిలాయ్), బీహార్ (పాట్నా, ముజఫర్‌పూర్), జార్ఖండ్ (రాంచీ, జంషెడ్‌పూర్), కర్ణాటక (బీజాపూర్, ఉడిపి, కలబురగి, బళ్లారి), ఒడిశా (రూర్కెలా, బ్రహ్మపూర్), కేరళ (కొల్లం), మహారాష్ట్ర (అమరావతి)లో జియో ట్రూ 5G సేవలు ప్రారంభం అయ్యాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !