ఖమ్మం గుమ్మం గులాబీమయం కావాలి..
– ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయండి
– బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొనకంచి
మన్యం న్యూస్, సారపాక , జనవరి 16..
రేపు ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లా కేంద్రంలోని
భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ సారపాక పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాస్ ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం సారపాక పంచాయతీలోని పలు కాలనీలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ బహిరంగ సభకు ప్రజల స్వచ్ఛందంగా తరలిరావాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్ మాట్లాడుతూ… రేపు జరగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఖమ్మం గుమ్మం గులాబీమయం కావాలని ఆయన కార్యకర్తలతో సూచించారు. సారపాక పంచాయతీలోని ప్రతి ఇంటి నుండి ప్రజల స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని ఆయన కోరారు. బిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి బహిరంగ సభకు ప్రజలు చీమలదండు వలె కదలి వచ్చి సభను ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. దేశంలో అవినీతి, రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుందని ఆయన అన్నారు. ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ముఖ్యమంత్రిలు, మాజీ ముఖ్యమంత్రి, తదితర ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగించనున్నారని వెల్లడించారు. ఖమ్మం సభను సక్సెస్ చేసేందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ అభిమానులు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఏసోబు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చుక్కపల్లి బాలాజీ, కృష్ణ, తిరుపతి, పంగి సురేష్ తదితరులు పాల్గొన్నారు
