UPDATES  

 తెలంగాణ దారి దీపాలు బృహత్తర గ్రంథంలో వాజేడు కు చెందిన విద్యావేత్త ఆలం లక్ష్మయ్య చరిత్ర కు చోటు.

మన్యం న్యూస్, వాజేడు:
తెలంగాణకు చెందిన వివిధ రంగాలకు సేవలు అందించిన మహనీయుల జీవన ప్రస్థానాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో
“తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ప్రచురించిన బృహత్తర గ్రంథం తెలంగాణ దారి దీపాలు లో వాజేడు కు చెందిన ప్రముఖ విద్యావేత్త, ఆలం లక్ష్మయ్య చరిత్రకు చోటు లభించినట్టు ప్రముఖ పరిశోధక రచయిత డా: అమ్మిన శ్రీనివాసరాజు తెలియజేశారు.
డా: గంటా జలంధర్ రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన 800 పేజీల ఈ బృహత్తర గ్రంథం, మంగళ వారం హైదరాబాదులో ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరణ జరగనున్నట్టు ఆయన తెలియజేశారు,.మన్నె సీమకు చెందిన మరుగున పడిన వ్యక్తుల వివరాలు భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే…. ఎటువంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఎంతో కష్టపడి చదివి ఢిల్లీ వరకు తన విద్యా, ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగించిన
గిరిజన విద్యావేత్త ఆలం లక్ష్మయ్య ” జీవితం నేటి యువతరానికి ఆదర్శమని
అందుకే తాను ఈ రచన చేసినట్లు, రచయిత డా:అమ్మిన, పేర్కొన్నారు.
వాజేడుకు చెందిన ప్రతి చరిత్రను విశ్వవ్యాప్తం చేయడమేతన లక్ష్యం అని ఆయన అన్నారు,
వాజేడు చరిత్రకు ఒక ప్రముఖ గ్రంథంలో స్థానం కల్పించిన డా: అమ్మిన సాహితీ కృషిని మండలానికి చెందిన అధికారులు,
ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు,గిరిజన సంఘాల నాయకులు, అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !