మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 16.. క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకగా నిలుస్తాయని క్రీడల్లో గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలని సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఉమ్మడి బంగారుచెలక పంచాయతీ లక్ష్మీపురంలో సిపీఐ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల జ్ఞాపకార్థంగా గత మూడు రోజులుగా వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది సోమవారం నాడు పోటీల్లో గెలుపొందిన జట్లకు ఆయన బహుమతులను అందజేశారు ఆర్లగండి జెట్టు కి మొదటి బహుమతి బొజ్జలగూడెం జట్టుకు రెండో బహుమతి అందజేశారు ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ .ప్రతి సవత్సరం అమరవీరుల జ్ఞాపకార్ధం క్రీడలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో అనేక మంది మట్టిలో మణిక్యాలు ఉన్నారని వారి ప్రతిభను వెలికితీసి ప్రభుత్వం ప్రోత్సహించాలని.క్రీడలకు సరైన నిధులు కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం .పూర్ణ కంటెం శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ కంటెం సత్యనారాయణ ,ఎంపీటీసీ కొమరం లలిత, చింతకుంట సర్పంచ్ రాజబాబు,మాజీ ఎంపీటీసీ దార శ్రీనివాసరావు,పారిపర్తి రాజు,వర్సా రామస్వామి, జోగ రామయ్య, లక్ష్మిపురం, బొజ్జలగూడెం సర్పంచ్ వసంతారావు, బక్కయ్య, జీవన్ ,బుచ్చయ్య పాల్గొన్నారు.